Tuesday, 03.19.2024, 5:46 AM
My site

KARTHIKA MASAM 29


KARTHIKA MASAM 29

దుర్వాసుడు అంబరి షుని శ పించుట

" అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి. అంత అంబరీ షుడు " ఓ పండి తో త్త ములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాద శీ నిష్ట ను విడ చుట కన్న, విప్రశాపము అధీక మయిన ది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు. ద్వాద శిని విడ చుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపాన ము నోనరించెను. అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారు డై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భో జనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంత టి ధర్మ పరి త్యాగి వి? అతి ధి కి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును. అట్టి అధ ముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజన మునకు బదులు జలపానము చే సితివి. అది భో జనముతో సమాన మైన దే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీ వు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహిం పడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే. నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు. నీ వు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడ వై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమాన పరచి నిర్ల క్ష్యముగా జలపాన మొన రించితివి. అబరి షా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కో పముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరిషుడు, మునికో పమున కు గడ గడ వణుకుచు, ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మ హీనుడ ను, నా య జ్ఞాన ముచే నే నీ కార్యము చే సితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము. మీరు త పోధ నులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు" డ ని అత ని పాద ములపై పడెను. దయాశూన్య డైన దూర్వసుడు అంబరి షుని తలను తన యెడమ కాలితో తన్ని"దోషికీ శాపమీయకుండా వుండ రా దు. నీ వు మొదటి జన్మలో చే పగాను, రెండవ జన్మలో తాబే లుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైద వ జన్మలో వామనుడు గాను,

ఆరోవ జన్మలో క్రూరుడ వగు బ్రాహణుడ వుగాను, యేడవ జన్మలో ముధుడ వైన రాజుగాను యెనిమిద వ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మత స్తు నిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయ లేని బ్రాహణుడ వుగాను పుట్టె ద వుగాక " అని వెనుక ముందు లాలో చించక శపించెను. ఇంక ను కోపము తగ్గ నందున మరల శ పించుటకు ఉద్యుక్త డ గుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణు శాపము వృధా కాకూడ దని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను. కాని దూర్వసుడింక నూ కోపము పెంచుకొని శపించు బో గా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయు నని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగి డేను. మహాతే జుస్సుతో చక్రాయుధ ము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడ మని భూ లో కమున ఉన్న మహామునులను, దేవలో కమున కరిగి దే వేంద్రుని, బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

పంచ వింశో ధ్యాయము - ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్పము

Login form
Search
Our poll
Rate my site
Total of answers: 38
Site friends
  • Create a free website
  • Online Desktop
  • Free Online Games
  • Video Tutorials
  • All HTML Tags
  • Browser Kits
  • Statistics

    Total online: 1
    Guests: 1
    Users: 0